తమ ప్రభుత్వంలో దోపిడి అనేది ఉండదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. నేడు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పుత్తూరు మున్సిపాలిటీకి తెలుగు గంగ నీరందించే ఫైల్పై తొలి సంతకం చేశారు. చిన్న వయసులో అనుభవం లేకున్నా తనపై నమ్మకంతో ఈ బాధ్యత ఇచ్చారన్నారు.జగన్కు జీవితాంతం రుణపడి ఉంటానని మంత్రి అనిల్ స్పష్టం చేశారు. వైఎస్ హయాంలో ప్రారంభించిన ప్రతి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఇరిగేషన్ శాఖలో అవినీతి జరిగిందని మంత్రి అనిల్ పేర్కొన్నారు. ప్రతి టెండర్ను జ్యూడిషియల్ కమిటీ ముందుంచుతామని మంత్రి అనిల్ స్పష్టం చేశారు.