ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈజిప్టులో భద్రతాబలగాల కాల్పులు

international |  Suryaa Desk  | Published : Fri, Jun 07, 2019, 02:02 PM

ఈజిప్టులో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది. ఆరిష్ నగరంలోని ఓ శిథిలావస్థలో ఉన్న భవనంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న పక్కా సమాచారంతో.. పోలీసులు ఆ భవనాన్ని చుట్టుముట్టి.. కాల్పులు జరిపారు. ఈ దాడిలో 14 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.దేశంలోని నార్త్ సినాయ్ ప్రావిన్సులో.. ఇటీవల ఉగ్రవాదుల దాడిలో 8మంది పోలీసులు మరణించారు. పోలీసులను హతమార్చిన ఉగ్రవాదులు అక్కడి నుంచి పారిపోయారు. దక్షిణ ఆరిష్ చెక్ పోస్టు వద్ద ఈ ఘటన జరిగింది. చెక్ పోస్టు వద్ద కాల్పులు తామే జరిపామని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. కాగా, ఈ రెండు ఘటనలు ఈజిప్టు దేశంలో సంచలనం రేపాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com