ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీకి ముందే రానున్న రుతుపవనాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jun 07, 2019, 02:01 PM

అనుకున్న సమయానికంటే ముందుగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నైరుతి రుతుపవనాలు రానున్నాయని ఆర్టీజీఎస్(రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) అంచనా వేసింది. దీంతో నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. 11, 12 తేదీల్లో రాయలసీమను తాకనున్న రుతుపవనాలు.. ఆపై రెండు రోజుల్లోపే దక్షిణ కోస్తాపై విస్తరిస్తాయని ఆర్టీజీఎస్ తెలిపింది. ఆలోపే తెలంగాణకు నైరుతి వ్యాపిస్తుందని ఆ సంస్థ వెల్లడించింది. అల్పపీడన ద్రోణి, క్యుములో నింబస్ మేఘాల కారణంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఆర్టీజీఎస్ అధికారి ఒకరు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com