ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రానికి సహకరించిన నీతి ఆయోగ్‌ భేటీకి రాలేను : మమతా బెనర్జీ

national |  Suryaa Desk  | Published : Fri, Jun 07, 2019, 02:18 PM

నీతి ఆయోగ్‌ సమావేశానికి తాను హాజరు కాబోనని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు మద్దతునిచ్చే అధికారం నీతి ఆయోగ్‌కు లేదని ఆమె అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి మమతా బెనర్జీ ఈ మేరకు ఒక లేఖ రాశారు. నీతి ఆయోగ్‌కు ఆర్థికపరమైన అధికారాలు లేవని, రాష్ట్ర ప్రణాళికలకు ఏమాత్రం సహకరించడం లేదని మమతా బెనర్జీ ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. ఎలాంటి ఆర్థిక అధికారాలు లేని సంస్థ సమావేశానికి హాజరు కావడం వల్ల ఉపయోగం లేదని భావిస్తున్నానని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు. నీతి ఆయోగ్‌ సమావేశానికి ప్రధాని మోడీ అధ్యక్షత వహిస్తారు. ఈ సమావేశంలో గవర్నింగ్‌ సభ్యులుగా ఉండే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com