యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్(యూఏఈ)లో నివసిస్తున్న ఓ భారతీయుడిని అదృష్టం వరించింది. ఆయనకు ఏకంగా 2.7 మిలియన్ల అమెరికన్ డాలర్ల లాటరీ తగిలింది. ఆర్.సంజయ్ నాథ్ అనే వ్యక్తి ఇటీవల అబు దాబీలో లాటరీ టికెట్ను కొన్నాడు. తాజాగా, బంపర్ ప్రైజ్ను ప్రకటించగా ఆయనకు 10 మిలియన్ల దిర్హామ్లు (2.7 మిలియన్ల యూఎస్డీ) వచ్చాయని యూఏఈ మీడియా తెలిపింది. అంతేకాదు, ఈ బంపర్ ప్రైజ్లు అందుకున్న మొదటి 10 మందిలో ఐదుగురు భారతీయులే ఉన్నారని పేర్కొంది. అబుదాబీలో ‘బిగ్ టికెట్’ సంస్థ చాలా కాలంగా లాటరీ ప్రక్రియలను కొనసాగిస్తోంది. మరో భారతీయుడు బినూ గోపినాథన్ రెండో బహుమతిగా 100000 దిర్హామ్లు గెలుచుకున్నాడు. గత నెల కూడా ఓ భారతీయుడు ఇటువంటి బంపర్ ప్రైజ్నే గెలుచుకున్నాడు. షార్జాలో నివసిస్తున్న షోజిత్ కేఎస్ గత నెలలో 15 మిలియన్ల దిర్హామ్లు (4.08 మిలియన్ల అమెరికన్ డాలర్లు) గెలుచుకున్నాడు.