శివసేన చీఫ్ ఉద్దవ్ థాకరే తనపార్టీకి చెందిన 18 మంది ఎంపీలతో త్వరలో అయోధ్యలో పర్యటించనున్నారు. పార్లమెంట్ సమావేశాలకు ముందే ఈపర్యటన ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. 2018 నవంబర్ 24,25 తేదీల్లో లోక్ సభ ఎన్నికలకు ముందు ఆయన పార్టీ కార్యకర్తలతో అయోధ్యలో తన పార్టీ కార్యకర్తలతో పర్యటించారు. వివాదాస్పద స్ధలంలో రామాలయం నిర్మించాలని ఆసమయంలో ఆయన డిమాండ్ చేశారు. లోక్ సభ ఎన్నికల్లోనూ రామాలయం నిర్మాణం చేపట్టాలని శివసేన డిమాండ్ చేసింది.