నియోజక వర్గానికి ముగ్గురు చొప్పున బెల్ నిపుణుల్ని కేటాయించినా వారి సేవల్ని వాడకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఎపి ఎన్నికల కమిషనర్ ద్వివేది. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ రోజు జరిగిన ఘటనలపై కలెక్టర్లను వివరణ కోరారు. పలు జిల్లాల్లో రూట్ మ్యాప్ లు కూడా సాంకేతిక నిపుణులకు ఇవ్వకపోవడాన్ని ఎన్నికల సంఘం గుర్తించింది. ఎన్నికలకు నాలుగు రోజుల ముందే రాష్ట్రానికి 600మంది బెల్ ఇంజినీర్లు వచ్చినా కలెక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై మండిపడ్డారు. సాయంత్రం 6 తర్వాత పోలింగ్ జరగడానికి కారణాలు రాతపూర్వకంగా వివరించాలని ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసిన వారిపై ఎఫ్.ఐ.ఆర్ లు నమోదు చేస్తామని హెచ్చరించారు. కృష్ణా జిల్లాలో ఒక ఆర్వో ఈవీఎంలను ఆలస్యంగా అప్పగించడం. రాజాం లో మైనర్లు ఓటు వేసిన ఘటనల్లో వెంటనే నివేదికలు పంపాలని ఆదేశించారు. మరికొందరు అధికారులపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయని ద్వివేది స్పష్టం చేశారు.