కడప జిల్లా ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో ఐదవ రోజు వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా కోదండరాముడు మోహినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చాడు. ఇవాళ రాత్రికి గరుడ వాహనసేవ నిర్వహించనున్నారు. రేపు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు సీతారాముల కల్యాణం జరగనుంది. కల్యాణోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరుకానున్నారు. ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. కోదండరాముడి కల్యాణాన్ని వీక్షించేందుకు లక్ష మంది భక్తులు వస్తారని టీటీడీ అంచనా వేస్తోంది. భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తుల కోసం 6 లక్షల వాటర్ ప్యాకెట్లు, 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు సిద్ధం చేసింది. 150 కౌంటర్ల ద్వారా ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు అందజేయనుంది.