రెండురోజుల తిరుమల పర్యటన నిమిత్తం మంగళవారం మద్యాహ్నం 12 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న శ్రీలంక ప్రసిడెంట్ మైత్రిపాల సిరిసేన, వారి కుటుంబ సభ్యులకు ఘనస్వాగతం లభించింది. జిల్లా కలెక్టర్ పి.ఎస్.ప్రద్యుమ్న , ఎపి ప్రోటోకాల్ అదనపు సెక్రటరీ లెఫ్టినెంట్ కల్నల్ అశోక్ కుమార్, తిరుపతి సబ్ కలెక్టర్ డా.మహేష్ కుమార్, తిరుపతి అర్బన్ ఎస్.పి.అన్బు రాజన్, స్వాగతం పలికిన వారిలో వున్నారు. శ్రీలంక మంత్రి అపోన్స్, శ్రీలంక ఎంబసీ డిప్యూటీ హై కమిషనర్ కృష్ణమూర్తి ఎయిపోర్టు డైరెక్టర్ శివ కుమార్ , ఎయిర్ పోర్ట్ సిఐ ఎస్ ఎఫ్ అధికారి మనీష్, అదనపు ఎస్పీ అనిల్ బాబు, ఎయిర్ పోర్టు అధికారులు రాజశేఖర్, బాబీ, తహశీల్దార్ మాధవ కృష్ణా రెడ్డి తదితరులు విమానాశ్రయం లో ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం,శ్రీలంక ప్రెసిడెంట్ వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక కాన్వయ్ వాహన శ్రేణిలో రేణిగుంట విమానమానాశ్రయం నుండి తిరుమల బయలుదేరి వెళ్లారు. బుధవారం ఉదయం తిరుమల శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని రాత్రి 8.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్లనున్నారు.