తన ఆరోగ్య కారణాలతో ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన ఎన్నికల ప్రచారానికి సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా రేపు మొత్తం మూడు జిల్లాలలో ఎన్నికల ప్రచారానికి జగన్మోహన్ సిద్ధమవుతున్నారు. జగన్ రేపు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలను చుట్టేయనున్నారు. రేపు ఉదయం 9.30 గంటలకు సత్తెనపల్లి, 11.30 గంటలకు గురజాలలో, 1.30 గంటలకు ఒంగోలు జగన్ ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. మధ్యాహ్నం 3.30 కు కృష్ణా జిల్లా మైలవరంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.