ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

national |  Suryaa Desk  | Published : Tue, Apr 02, 2019, 05:15 PM

దేశంలో జరగనున్న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 9 రాష్ట్రాల్లోని 71 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. బీహార్‌లోని 5 స్థానాలకు, జార్ఖండ్‌లోని 3, మధ్యప్రదేశ్‌లోని 6, మహారాష్ట్రలోని 17, ఒడిషాలోని 6, రాజస్థాన్‌లోని 13, ఉత్తరప్రదేశ్‌లోని 13, పశ్చిమబెంగాల్‌లోని 8 స్థానాలకు నాలుగో విడతలో భాగంగా పోలింగ్‌ నిర్వహించనున్నారు. మంగళవారం నుంచి ఏప్రిల్ 9 వరకు అభ్యర్థుల నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్‌ 10న నామపత్రాల పరిశీలన, 12వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.మే 23న ఫలితాలు వెలువడతాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com