దేశంలో జరగనున్న నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. 9 రాష్ట్రాల్లోని 71 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 29న పోలింగ్ జరుగుతుందని ఎన్నికల సంఘం ప్రకటించింది. బీహార్లోని 5 స్థానాలకు, జార్ఖండ్లోని 3, మధ్యప్రదేశ్లోని 6, మహారాష్ట్రలోని 17, ఒడిషాలోని 6, రాజస్థాన్లోని 13, ఉత్తరప్రదేశ్లోని 13, పశ్చిమబెంగాల్లోని 8 స్థానాలకు నాలుగో విడతలో భాగంగా పోలింగ్ నిర్వహించనున్నారు. మంగళవారం నుంచి ఏప్రిల్ 9 వరకు అభ్యర్థుల నామినేషన్లు స్వీకరిస్తారు. ఏప్రిల్ 10న నామపత్రాల పరిశీలన, 12వ తేదీ వరకు నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు.మే 23న ఫలితాలు వెలువడతాయి.