ముంబై : ఈశాన్య ముంబై నియోజక వర్గంనుంచి తాను పోటీ చేస్తానని శివసేన ఎంపి సంజయ్ రవుత్ సోదరుడు, ఎమ్మెల్యే సునీల్ రవుత్ చెప్పారు. ఈ నియోజక వర్గానికి కిరీట్ సోమయ్యకు బిజెపి టికెట్ ఇచ్చినా సరే తాను ఇక్కడినుంచే పోటీ చేస్తానని ఆయన అన్నారు. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థిగా సోమయ్యకు వ్యతిరేకంగా పోటీ చేస్తానని ఆయన చెప్పారు. తాను 100 శాతం విజయం సాధిస్తానని ఆయన అన్నారు.