ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌ పట్ల కాపులకు విశ్వాసం ఉంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Apr 29, 2024, 10:16 AM

కాపు కులస్తులను సర్వనాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు. అలాంటి వ్యక్తితో నువ్వు చెట్టాపట్టాలేసుకుని తిరగడానికి నువ్వు సిగ్గుపడాలి అని మాజీమంత్రి  కురసాల కన్నబాబు అన్నారు. అయన మాట్లాడుతూ..... కాపులను కాపు కాస్తున్న ఒకే వ్యక్తి జగన్‌ గారు మాత్రమే. కాపు సోదరులపై కేసులు ఎత్తివేసింది కూడా వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వమే. ఈబీసీ నేస్తం ద్వారా కాపులకు మేలు చేసిన ప్రభుత్వం కూడా మాదేనని మేం గర్వంగా చెప్పుకుంటాం. గతంలో 30 మంది కాపులను ఎమ్మెల్యేలను చేయడమే గాకుండా ఐదుగురు కాపులను మంత్రులుగా చేసిన ఘనత జగన్‌ గారికే దక్కుతోంది. జగన్‌ అంటే నమ్మకం, విశ్వాసం ఉండబట్టే.. నువ్వు జనసేనలో మోసం చేస్తే కాపులంతా వైఎస్‌ఆర్‌సీపీలోకి చేరుతున్నారని తెలుసుకో అని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com