కాకినాడ: దేశంలో ఎవరూ చేయని విధంగా రూ.24వేల కోట్ల రుణమాఫీ చేశామని మంత్రి లోకేశ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో లోకేశ్ మాట్లాడారు. 2014కి ముందు రూ.200 పెన్షన్ ఉండేదని, ఆ తర్వాత చంద్రబాబు రూ.వెయ్యి నుంచి రూ.2వేలకు పెంచారన్నారు. రాష్ట్రంలో ఆర్థిక వనరులు పెరిగిన తర్వాత పెన్షన్లు పెంచారన్నారు. రూ.16వేల కోట్ల లోటు బడ్జెట్తో రాష్ట్ర విభజన జరిగిందన్నారు. ఇబ్బందులు ఎన్ని వచ్చినా ఇచ్చిన హామీలను నెరవేర్చారన్నారు.