గుంటూరుః సీఎం చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లాలోని కొండవీడు కోట ఉత్సవాల్లో పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన కొండవీడు ఘాట్ రోడ్డును సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం కొండవీడు నగర వనానికి సీఎం శంకుస్థాపన చేశారు. కొండపైన పుట్టాలమ్మ, ముత్యాలమ్మ, వెదుళ్ల చెరువులను, కొండపైన కట్టడాలు, దేవాలయాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనందబాబు పాల్గొన్నారు.