మీడియాలో షెడ్యూల్డ్ కులాల వారిని ‘దళితులు’గా పేర్కొన రాదంటూ కేంద్రం జారీ చేసిన ఆదేశాలను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడాన ధర్మాసనం ఈ పిటిషన్ను విచారించడానికి తిరస్కరించింది. దళిత పదం వాడవద్దని, దాని బదులు షెడ్యూల్డ్ కులాలు అని ఉపయోగించాలంటూ కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ గత ఏడాది ఆదేశాలు జారీ చేసింది. దీనిని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పిటిషనర్ వి ఎ రమేశ్ నాథన్ తరఫున సీనియర్ అడ్వొకేట్ కపిల్ సిబాల్ వాదనలు వినిపించారు. అయితే ధర్మాసనం దీనితో ఏకీభవించలేదు. ప్రస్తుత దశలో ఈ పిటిషన్
విచారించడానికి తాము సుముఖంగా లేమని చెబుతూ పిటిషన్ను కొట్టివేస్తున్నామని పేర్కొంది.