తుని : జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడికి అమరులైన జవాన్ల కుటుంబాలకు తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ డాక్టర్ పాండురంగారావు లక్ష రూపాయల విరాళాన్ని అందజేశారు. సోమవారం తుని తహసిల్దార్ కార్యాలయంలో తహసిల్దార్ ఎంవి సత్యనారాయణ, ఎన్నికల రిటర్నింగ్ అధికారి దయానిధికి లక్ష రూపాయల నగదును అందజేసి డాక్టర్ పాండురంగారావు తన ఉదారతను చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయులందరు అమరవీరుల కుటుంబాలను ఆదుకునేందుకు ముందుకు రావాలని, ఇటువంటి సంఘటన పునరావతం కాకుండా ఉండే విధంగా కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ నాయకులు షేక్ సుభాని, అరిగెల శేషు, ఇంటి వీరభద్రరావు, గేలం శ్రీనివాసరావు, భీమా నాయుడు తదితరులు పాల్గొన్నారు.