విశాఖ : విశాఖ ఉక్కు ప్రారంభమై సోమవారంతో (1982-2019) 37 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.. నేడు (సోమవారం) విశాఖ ఉక్కు ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా త్రిష్ణ మైదానంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రతిష్టాత్మకమైన నెహ్రూ అవార్డులు అందచేయనున్నారు. ఈ వేడుకలలో సిఎండి ప్రసంగించనున్నారు.