టెక్కలిలో నూతనంగా నిర్మించిన సబ్ కోర్టు భవన సముదాయాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఛీఫ్ జస్టిస్ మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో న్యాయం తీసుకువచ్చేలా న్యాయవాదులు కృషి చేయాలన్నారు. నూతన భవన సముదాయం విశాలంగా సౌకర్యవంతంగా ఉందని, ఇందులో ప్రజల అవసరాలు తీర్చేందుకు సౌకర్యాలుండటం హర్షణీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ కింజరాపు అచ్చెన్నాయుడు, సబ్ కోర్టు జడ్జీ, అడ్వకేట్లు పాల్గొన్నారు.