ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జనసేన ప్రచార రథాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 17, 2019, 03:30 PM

తూర్పుగోదావరి జిల్లా తుని నియోజకవర్గంలో జనసేన ప్రచారం హోరెత్తుతోంది.  నియోజకవర్గ జనసేన నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు పార్టీ శ్రేణులతో కలిసి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలతో మమేకం అవుతున్నారు. ఆదివారం తలుపులమ్మ అమ్మవారిని దర్శించుకున్న అశోక్ బాబు పార్టీ ప్రచార రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. జనరల్ మార్కెట్లో పర్యటించి వర్తకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి జనసేన పాటు పడుతుందని భరోసా ఇచ్చారు. తాను శాసన సభ్యుడిగా పనిచేసిన సమయంలో ఎంతో అభివృద్ధి సాధించామని, నీతివంతమైన పాలన అందించేందుకు జనసేన కు పట్టం కట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు చోడిశెట్టి గణేష్ , బోనం చినబాబు, మందపల్లి రాంబాబు, కుక్క డపు శ్రీను, దంతులూరి బాబు, పృథ్వి రాజ్, బుడ్డిగా కృష్ణ ,చల్ల కొండ సుబ్బారావు, కె సురేష్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com