విజయవాడ : వైకాపా వ్యవస్థాపక అధ్యక్షులు కొలిశెట్టి శివకుమార్ మాట్లాడుతూ .. వైయస్సార్ పై అభిమానంతో నేను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టా కలిసి పార్టీని నడుపుదాము అని చెప్పి జగన్ చేరారు. ఎవరైతే రాజశేఖర్ రెడ్డి దూషించారో ఆ కేసీఆర్ తో కలిసి పార్టీని తెలంగాణ లో భ్రష్టు పట్టించారు. తెలంగాణ లో కేసీఆర్ తో కలిసి వెళ్లాడాన్ని ప్రశ్నించినందుకు నన్ను పార్టీ నుండి సస్పెండ్ చేశారు.వైకాపా పగ్గాలను తిరిగి నేనే చేపడతా, ఇప్పటికే ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశా. వైకాపా పార్టీ ఎన్నికల కమిషన్ లో నాపేరు మీదే ఉంది. త్వరలో 18 వ విజయవాడ లో లేదా గుంటూరు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి కార్యాచరణ ప్రకటిస్తా...