ఆంధ్రప్రదేశ్ మెడికల్ హబ్ గా మారనుందని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. తుళ్లూరులోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్-రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భూమి పూజ చేశారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ…అమరావతికి 14 వైద్య కళాశాలలు రాబోతున్నాయన్నారు. కాలుష్య నివారణకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. కొత్త సంస్థలు వస్తున్నాయంటే ఇక్కడ భూములిచ్చిన ఘనత రైతులదేనన్నారు. ప్రకృతి వ్యవసాయ విధానంలో నవ్యాంధ్రప్రదేశ్ ప్రపంచానికే నమూనా అన్నారు. ప్రపంచమంతా అమరావతి వైపు చూడాలన్నదే అభిమతమని చంద్రబాబు అన్నారు.