ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శరణ్‌గౌడ్‌ ఫిర్యాదు మేరకు యడ్యూరప్పపై ఎఫ్‌ఐఆర్‌

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 14, 2019, 10:38 AM

     బెంగళూరు : ఆడియో టేప్‌లకు సంబంధించి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బిఎస్‌.యడ్యూరప్పపై రాయ్‌చూర్‌ జిల్లా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. జెడి(ఎస్‌) ఎమ్మెల్యే నాగన్‌గౌడ్‌ కుమారుడు శరణ్‌గౌడకు నగదు, మంత్రి పదవి ఇస్తామని ప్రలోభపెట్టినట్లు ఇటీవల ఆడియోటేప్‌ను కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శరణ్‌గౌడ్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అవినీతి నిరోధక చట్టం 1988 ప్రకారం యడ్యూరప్పపై కేసు నమోదుచేసినట్లు అధికారులు తెలిపారు. అలాగేమరో ఇద్దరు బిజెపి ఎమ్మెల్యేలు దేవదుర్గకు చెందిన శివనాగౌడ నాయక్‌, హసన్‌కుచెందిన ప్రీతమ్‌ గౌడ్‌లతో పాటు యడ్యూరప్ప సలహాదారుగా ఉన్న మాజీ జర్నలిస్ట్‌, న్యాయవాది మారాంకల్‌పై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు తెలిపారు. యడ్యూరప్ప, శరణ్‌గౌడ్‌తో సమావేశమైన సమయంలో వీరుకూడా అదే నివాసంలో ఉన్నట్లు తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com