ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కూటమి గెలుపుకి కారణం కాపులే, కించపరిస్తే ఊరుకోము

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Oct 28, 2024, 10:07 PM

కాపులకు ఇచ్చే నామిటెడెడ్‌ పదవులపై టీడీపీ నాయకుడు శశికాంత్‌భూషణ్‌ మరోసారి కించపరిచేలా మాట్లాడితే చూస్తూ ఊరుకో బోమని కాపు సంఘం నాయకులు హెచ్చరించారు. ఒంగోలు కాపు సంఘం కార్యాలయంలో ఆదివారం వనభోజన మహోత్సవ కరప త్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ టీడీపీ ఒంగోలు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ సమక్షంలోనే ఎద్దు శశికాంత్‌భూషణ్‌ కాపులపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. కాపులపై మరోసారి ఇష్టారీతిన మాట్లాడితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తోందని హెచ్చరించారు.


కూటమి ప్రభుత్వ ఏర్పా టు కోసం కాపులు 90శాతం మంది ఓట్లు వేసి రాష్ట్రంలో, ఒం గోలులో గెలుపు కోసం కృషి చేశారన్నారు. గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి తన కోసం కష్టపడి పనిచేసిన కాపు కులానికి చెం దిన సింగరాజు వెంకట్రావు కుటుంబానికి ఒడా చైర్మన్‌ పదవి ఇచ్చారన్నారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే దామచర్ల కూడా ఆలో చించి మీకోసం కష్టపడి ఎవరు పనిచేశారో వారికి కూటమిలో ఉన్న ఏ కాపుకైనా చైర్మన్‌ పదవిని ఇవ్వాలని కాపు సంఘం నా యకులు కోరారు. కాపు వనభోజన మహోత్సవానికి 36 మం దితో తొమ్మిదిబృందాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కాపు సంఘం అధ్యక్షుడు కొక్కిరాల సంజీవ్‌కుమార్‌, టి.శ్రీనివాసమూ ర్తి, కె.శ్రీనివాసరావు, నరహరి సాంబయ్య, తోటకూర చినవెంక ట్రావు, పూల శ్రీను, మిరియాల శ్రీనివాసరావు, చింతపల్లి నారా యణ, మేకల నారరాయణ, ఆలూరి శ్రీహరి, కోడె నాగరాజు, శే ఖర్‌, రాయళ్ల వెంకట్రావు, దూడల బ్రహ్మయ్య పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com