అక్రమ ఆస్తుల కోసం తల్లిని, చెల్లిని కోర్టుకు ఈడ్చిన మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రాజకీయాల్లో ఉండటానికి అర్హుడు కాదని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. జూబ్లీహిల్స్లో బంగ్లా, లోటస్ పాండ్, బెంగళూరులో 82 గదుల ప్యాలెసులు జగన్కు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
‘‘ఈ లక్షల కోట్లు అన్నీ మీ తాత, తండ్రి నీకు ఇచ్చిన ఆస్తులు కాదు కదా’’ అని నిలదీశారు. జగన్ జైలుకెళ్లాడు కానీ షర్మిల జైలుకు వెళ్లలేదు కదా.. అందుకే ఆమెకు ఆస్తుల్లో వాటా రాదని వైవీ సుబ్బారెడ్డి చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు.