ప్రజా సమస్యలు పరిష్కారమే ప్రజా దర్బార్ ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశుసంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సాలూరులోని తన నివాసంలో ఆదివారం ఆమె ప్రజాదర్బార్ కార్యక్రమం నిర్వహించారు. పాచిపెంట మండలం కొత్తూరు పంచాయతీ కొత్తపొలంవలస, పాతపొలంవలస గ్రామస్థులు వచ్చి తమ గ్రామాలకు రహదారి మంజూరు చేయాల ని కోరారు.
సాలూరు మండలం కందులపథం పంచాయతీ తీనుసామంతవలస, మర్రివానివలస, గ్రామస్థులు వచ్చి పూర్వం నుంచి శ్మశానవాటికగా ఉన్న స్థలాన్ని కొంతమంది ఆక్రమించారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా జీసీసీలో కారుణ్య నియామకాలు చేపట్టాలని ఆయా కుటుంబాలు విజ్ఞప్తి చేశాయి. శ్రీసత్యసాయిధ్యాన మండలి సభ్యులు వచ్చి పట్టణంలో కాలుష్య నివారణం కోసం మొక్కలు నాటేందుకు ప్రభుత్వం ద్వారా నిధులు కేటాయించాలని కోరారు.