అధికారులు, రాజకీయ నాయకులు కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాష్ట్రంలో కీలకమైన జిల్లా గుంటూరు అని చెప్పారు. సర్వతోముఖాభివృద్ధి చేసే విధంగా సమీక్షా చేశామని అన్నారు. ఏ ఏ అంశాలపై దృష్టి సారించాలనే వాటిపై సమీక్ష చేశామని చెప్పారు. అభివృద్ధిపై ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై కూడా చర్చించామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కాలువల ఆధునికీకరణపై ఎమ్మెల్యేలతో సమీక్షా చేశామని. నిధుల సమీకరణపై త్వరలోనే శుభవార్త చెబుతామని అన్నారు.
సూర్యలంక బీచ్ పర్యాటక కేంద్రమని. వీటిని అభివృద్ధి చేసిన తర్వాత మెయింటనెన్స్ కోసం ఛార్జీలు వసూలు చేయాలని ఆలోచన చేస్తున్నామని అన్నారు. సీ ప్లేన్ను వచ్చే నెల 9 నుంచి ప్రారంభిస్తామని తెలిపారు. నాలుగు బీచ్ల్లో వీటిని ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఇందుకోసం త్వరలోనే అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అవినీతికి పరాకాష్ట రుషికొండ భవనాలని ఆరోపించారు. వాటిని ఏవిధంగా ఉపయోగించాలన్న అంశంపై సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారని అన్నారు. శాఖల మధ్య సమన్వయం కోసం సీఎం చంద్రబాబు సబ్ కమిటీ వేశారని మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.