గత ఎన్నికల్లో ఐటీడీపీ కీలక పాత్ర పోషించిందని టీడీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో 7 నియోజకవర్గాల నుంచి వచ్చిన ఐటీడీపీ సభ్యులతో ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్, రాష్ట్ర కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి వై. నాగేశ్వరరావు యాదవ్, టూరిజం డైరెక్టర్ ముంతాజ్, నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్ కలిసి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకు పార్టీ సభ్యత్వం ఇచ్చే దిశగా పని చేస్తామని అన్నారు. చంద్రబాబు, నారా లోకేష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పార్టీ కోసం పని చేసే ప్రతి ఒక్కరిని కుటుంబ సభ్యుల్లాగా కాపాడుకోవాలనే ఆలోచనతో ఈ కొత్త పాలసీ తెరపైకి తెచ్చారన్నారు. ఆదోని ఐటీడీపీ ఇన్చార్జి అంజలి, మంత్రాలయం ఐటీడీపీ ఇన్చార్జి నీలకంఠ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు సత్రం రామకృష్ణ పాల్గొన్నారు.