ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెజ్బొల్లా దాడిలో ఇజ్రాయేల్ ఆర్మీ చీఫ్ హలేవీ మృతి?

international |  Suryaa Desk  | Published : Mon, Oct 14, 2024, 10:14 PM

లెబనాన్ సరిహద్దుల్లోని బిన్యామినా ప్రాంతంలో ఇజ్రాయేల్ సైనిక స్థావరమే లక్ష్యంగా హెజ్బొల్లా ఆదివారం డ్రోన్లతో విరుచుకుపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో నలుగురు ఇజ్రాయేల్‌ సైనికులు మృతిచెందగా.. 60 మందికిపైగా గాయపడ్డారు. అయితే, ఈ దాడిలో ఇజ్రాయేల్ ఆర్మీ చీఫ్ చనిపోయినట్టు ప్రచారం జరుగుతోంది. ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఫ్‌) చీఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ హెర్జి హలేవి మృతి చెందారని సోషల్ మీడియాలో తొలుత వందతులు మొదలయ్యాయి. అమెరికా కామెంటేటర్‌ జాక్సన్‌ హింక్లె కూడా దీనిని ప్రస్తావించడంతో వైరల్ అయ్యింది. మరింత మంది వెరిఫైడ్‌ ఎక్స్‌ (ట్విట్టర్) ఖాతాల్లో దీని గురించి ప్రచారం చేశారు.


అయితే, కొద్దిసేపటి తర్వాత ఈ ప్రచారాన్ని ఇజ్రాయేల్ పత్రిక కొట్టిపారేసింది. ఇవన్నీ వదంతులని, ఇందులో నిజం లేదని జెరూసలెం పోస్టు ఓ కథనం ప్రచురించింది. ఆయన క్షేమంగా ఉన్నారని పేర్కొంది. హెబ్బొల్లా డ్రోన్ దాడి జరిగిన ప్రదేశం ఐడీఎఫ్‌ గోలాన్‌ బ్రిగేడ్‌కు చెందిన శిక్షణ శిబిరంలోని మెస్‌గా సమాచారం. డ్రోన్ల మెరుపు వేగంతో ఏకకాలంలో విరుచుకుపడటం వల్ల ఇజ్రాయేల్ గగనతల రక్షణ వ్యవస్థలు వ్యవస్థలు నిర్వీర్యమైపోయినట్లు తెలుస్తోంది. ఈ దాడిపై ఐడీఎఫ్‌ ప్రతినిధి హగారీ స్పందిస్తూ.. తమకు ఈ యుద్ధంపై పూర్తిగా పట్టు ఉందని అన్నారు. తమ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను అవి ఎలా తప్పించుకున్నాయో దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఇజ్రాయేల్‌పై జరిగిన అతిపెద్ద దాడుల్లో ఇది కూడా ఒకటి.


సైనిక స్థావరంపై దాడిచేసిన డ్రోన్లను హెజ్బొల్లా అమ్ములపొదిలోని మిర్సాద్‌-1 రకంగా గుర్తించారు. గంటకు 370 కిలోమీటర్ల వేగంతో 120 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై దాడి చేయగల సామర్థ్యం వీటి సొంతమని నిపుణులు చెబుతున్నారు. వీటిలో దాదాపు 40 కిలోల పేలుడు పదార్థాలను అమర్చవచ్చని, ఇది దాదాపు 3,000 మీటర్ల ఎత్తు వరకు ఎగరగలదని అన్నారు. ఇరాన్‌కు చెందిన సూసైడ్‌ డ్రోన్‌ మొహాజిర్‌-2 శ్రేణికి చెందిన ఇది హెజ్బొల్లా ప్రధాన డ్రోన్‌. దీనిని 2002 నుంచి హెజ్బొల్లా వినియోగిస్తోంది.


భారీ సంఖ్యలో రాకెట్లతో కలిపి ఈ డ్రోన్లను హెజ్బొల్లా ప్రయోగించడంతో ఇజ్రాయేల్‌ అడ్డుకోవడంలో విఫలమైనట్టు నిపుణులు తెలిపారు. తమ ఎయిర్‌డిఫెన్స్‌ వ్యవస్థలను ఇది తప్పించుకోవడం ఇదే మొదటిసారి అని టెల్‌ అవీవ్‌ సైనిక నిపుణులు వెల్లడించారు. డ్రోన్ దాడికి ముందు తాము హైఫా సమీపంలోని సైనిక స్థావరంపై రాకెట్లను పెద్ద సంఖ్యలో ప్రయోగించినట్టు హెజ్బొల్లా గ్రూప్ ప్రకటించింది.


కాగా, ఇటీవలి ఇజ్రాయేల్.. హెజ్బొల్లా‌కు సాంప్రదాయకంగా బలమైన దక్షిణ బీరుట్, లెబనాన్ దక్షిణ, తూర్పు ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి సారించింది. వైమానిక దాడుల్లో హెజ్బొల్లా లాంచర్లు, యాంటీ ట్యాంక్ క్షిపణి పోస్ట్‌లు, ఆయుధ నిల్వ కేంద్రాలు, ఇతర లక్ష్యాలతో పాటు డజన్ల కొద్దీ సాయుధులను మట్టుబెట్టింది. దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయేల్ వరుస దాడులతో అనేక సరిహద్దు గ్రామాల ధ్వంసమైనట్టు లెబనాన్ వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com