ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళలోని త్రిసూర్ లో టీఎస్ కల్యాణరామన్ ఇంట దసరా సంబరాలు చిరంజీవి, నాగార్జునలకు ప్రత్యేక ఆహ్వానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 13, 2024, 07:04 PM

ప్రముఖ బంగారు, వెండి ఆభరణాల తయారీదారు కల్యాణ్ జ్యుయెలర్స్ సంస్థ యజమాని టీఎస్ కల్యాణరామన్ ఇంట దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కేరళలోని త్రిసూర్ లో జరిగిన ఈ శరన్నవరాత్రి సంబరాలకు టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున కూడా హాజరయ్యారు. కల్యాణ్ జ్యుయెలర్స్ ఎండీ టీఎస్ కల్యాణరామన్ ఆహ్వానం మేరకు చిరంజీవి, నాగార్జున ప్రత్యేక విమానంలో త్రిసూర్ వెళ్లారు. ఈ వేడుకల్లో కల్యాణరామన్ తో కలిసి చిరంజీవి, నాగార్జున జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం బొమ్మల కొలువును సందర్శించి అమ్మవారికి పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com