ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ రైతులకు భారీ ఊరట.. ఆ డబ్బులు కూడా ప్రభుత్వమే ఇస్తుంది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 05, 2024, 09:21 PM

ఏపీలో ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఊరట ఇచ్చారు. గత ప్రభుత్వం తీసుకొచ్చిన.. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులకు ఇబ్బందిగా మారిన రైస్ మిల్లుల ర్యాండమైజేషన్ విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. రైతులు ఇకపై సమీపంలోని తమకు నచ్చిన మిల్లలుకు ధాన్యాన్ని తరలించుకునే వెసులుబాటును కల్పించాలని చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం సేకరణలో రైతులకు సాధ్యమైనంత వరకు ఇబ్బందుల్లేకుండా నిబంధనలను


సులభతరం చేశాడు.


రైతుల నుంచి ధాన్యం సేకరణ ప్రక్రియలో రైసు మిల్లుల ర్యాండమైజేషన్‌ విధానాన్ని రద్దు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. రైతులు తమకు ఇష్టమైన మిల్లులకే ధాన్యాన్ని రవాణా చేసుకునే వెసులుబాటు ల్పించాలని.. అందుకు అవసరమైన రవాణా వాహనాలు, గోనె సంచులను సమకూర్చడంతోపాటు ధాన్యం ఎగుమతి, దిగుమతులకు అయ్యే లేబర్‌ ఛార్జీలను కూడా చెల్లించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇటు రాష్ట్రంలో కౌలు రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వానికే విక్రయించేలా ప్రోత్సాహించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు.


ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అవకతవకలకు అవకాశం లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు. రైతుల బయోమెట్రిక్‌ ఆధారంగా ధాన్యాన్ని సేకరించాలని.. అలాగే ఆ ధాన్యాన్ని మిల్లులకు రవాణా చేసే వాహనాలను జీపీఎస్‌ పరికరాల ద్వారా ట్రాక్‌ చేయాలని కీలక సూచన చేశారు. మిల్లుల దగ్గర అన్‌లోడింగ్‌ ఆలస్యం కాకుండా తగినంత మంది హమాలీలను ఏర్పాటు చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియపై సమీక్ష అనంతరం పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ విజయవాడలోని సివిల్‌ సప్లయిస్‌ భవన్‌లో రైసు మిల్లర్లు, రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు.


మంత్రి రాష్ట్రంలో ధాన్యం సేకరణకు సంబంధించి ప్రభుత్వం అమలు చేయనున్న విధివిధానాలపై వారందరికి అవగాహన కల్పించారు. ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని.. భారత ఆహార సంస్థ అభ్యర్థన మేరకు 2 లక్షల బాయిల్డ్‌ రైసును కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల రైసుమిల్లర్లు సరఫరా చేయాల్సి ఉంటుందన్నారు మంత్రి మనోహర్.


గత ప్రభుత్వ హయాంలో ర్యాండమైజేషన్ విధానం వల్ల రైతులు ఇబ్బందిపడ్డారనే విమర్శలు ఉన్నాయి. రైతులు తమ ధాన్యాన్ని ప్రభుత్వానికి మద్దతు ధరకు అమ్ముకోవడానికి కష్టాలు పడాల్సివచ్చింది అంటున్నారు. అన్నదాతలు విక్రయించిన ధాన్యాన్ని సమీపంలోని మిల్లులకు కాకుండా ర్యాండమైజేషన్‌ పేరుతో దూరప్రాంతాల్లో ఉన్న కొంతమంది నేతల చెందిన మిల్లులకు రవాణా చేసేవారనే ఆరోపణలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో జిల్లాలను దాటించి వంద కిలోమీటర్లకు పైగా దూరాన ఉన్న మిల్లులకు తరలించాల్సిన సరిస్థితి వచ్చేందన్నారు. అందుకయ్యే లేబర్‌, రవాణా ఖర్చులను కూడా తామే చెల్లిచడం భారంగా మారిందన్నారు. గోనె సంచులు కూడా సరఫరా చేయలేదన్నారు. అందుకే కూటమి ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల సమయంలో ఎలాంటి సమస్యలు రాకుండా కీలక నిర్ణయం తీసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com