ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులో కాల్పుల మోత

national |  Suryaa Desk  | Published : Fri, Oct 04, 2024, 04:47 PM

ఛత్తీస్ గఢ్ లో మరో భారీ ఎన్ కౌంటర్ చోటుచేసుకుంది. పోలీసుల ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. దంతెవాడ-నారాయణపూర్ సరిహద్దులోని అబూజ్ మాఢ్ అటవీప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు భారీగా ఆటోమేటిక్ ఆయుధాలను, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.కాగా, మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైన కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. కేంద్ర బలగాలు, చత్తీస్ గఢ్ పోలీసులతో కూడిన సంయుక్త కార్యాచరణ బృందం ఈ కాల్పుల్లో పాల్గొంది. భద్రతా బలగాలకు ఎలాంటి హాని జరగలేదని ఓ అధికారి తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com