ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో రేషన్ కార్డులు ఉన్నవారికి .. అక్టోబర్ నెల నుంచి పక్కా, కాకపోతే ఆ రెండు ఇవ్వరు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2024, 09:00 PM

ఆంధ్రప్రదేశ్‌లో రేషర్ కార్డులు ఉన్నారికి ముఖ్యమైన గమనిక. అక్టోబర్ నెలలో రేషన్‌ పంపిణీపై సంబంధించి.. బియ్యం, పంచదార మాత్రమే సరఫరా చేసే అవకాశం ఉంది. పౌర సరఫరాల గోదాములకు ఇప్పటి వరకు ఈ రెండు సరుకులే చేరడంతో ఈ నెల కూడా కందిపప్పు, గోధుమ పిండి కష్టం అంటున్నారు. అక్టోబరులో దసరా, దీపావళి పండగలు ఉన్నాయి.. ఇలాంటి సమయంలో కందిపప్పు, గోధుమ పిండి సరఫరా చేస్తే బావుంటుంది అంటున్నారు.


గతంలో రేషన్ సరకుల్లో బియ్యం, గోధుమ పిండి, కందిపప్పు, పంచదార పంపిణీ చేసేవారు. ఆ తర్వాత కందిపప్పు ఆగిపోయింది.. గోధుమ పిండి పంపిణీ అంతంతమాత్రంగానే ఉంది. సెప్టెంబరు నెలలో బియ్యం మాత్రమే ఇచ్చారు.. అక్టోబరులో బియ్యం, పంచదార సరఫరా చేయనున్నారు. నిత్యావసర వస్తువుల రేట్లు పెరగడంతో సామాన్యులకు భారంగా మారింది.. కందిప్పు రకాన్ని బట్టి కిలో రూ.180కుపైగా ఉంది.. గోధుమ పిండి కేజీ రూ.60 వరకు నడుస్తోంది. అసలే పండుగలు కూడా ఉన్నాయి.. కందిపప్పు, గోధుమ పిండి కూడా పంపిణీ చేస్తే బావుంటుందంటున్నారు.


వాస్తవానికి సెప్టెంబర్ నుంచి కందిపప్పు, చక్కెరను పంపిణీ చేయాలని భావించారు.. ఆ దిశగా ప్రభుత్వం టెండర్లు కూడా పిలిచింది. కానీ కొన్ని అనివార్య కారణాలతో ఆ రెండు సరుకులు పంపిణీ చేయలేదు.. అక్టోబర్ నెలలోనైనా కందిపప్పు, చక్కెర, గోధుమ పిండి ఇస్తారని భావించారు. కానీ ఈ నెల కూడా బియ్యం, చక్కెరకే పరిమితం అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకే తమకు రాయితీపై కందిపప్పు, గోధుమపండితోపాటు వంటనూనెలు కూడా సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.


గతంలో రేషన్‌లో బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార, నూనె, చింతపండు వంటి ఏడు రకాల వస్తువులు పంపిణీ చేసేవారు. ఆ తర్వాత సరుకుల్లో కోతలు మొదలయ్యాయి.. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న రేషన్‌లో ఏ సరుకు ఏ నెలలో అందుతుందో క్లారిటీ లేకుండా పోయింది. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పౌరసరఫరాలశాఖపై ఫోకస్ పెట్టారు. ఆశాఖ బాధ్యతల్ని చూస్తున్న మంత్రి నాదెండ్ల మనోహర్.. రేషన్ సరుకుల్లో నాణ్యత, తూకాల్లో తేడాలు, మరికొన్ని లోపాలు ఉన్నట్లు గుర్తించారు. అందుకే లోపాలను సరిచేసి ప్రజలకు సరకులు అందిస్తామని చెప్పారు. పండుగలు ఉన్న నెలలోనైనా తమకు సరుకులు ఇవ్వాలని రేషన్‌కార్డులు ఉన్నవారు కోరుతున్నారు. మార్కెట్‌లో మండుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని.. ప్రభుత్వం తమకు రేషన్‌ దుకాణాల ద్వారా కందిపప్పు, గోధుమపండితోపాటు వంటనూనెలు కూడా రాయితీపై సరఫరా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మరి ఏపీ ప్రభుత్వం రేషన్ సరుకులపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com