ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని ప్రతి భక్తుడూ పవిత్రంగా భావిస్తారన్న వెంకయ్య

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 20, 2024, 08:42 PM

తిరుమల శ్రీవారి ప్రసాదం విషయమై వస్తున్న వార్తలు తనను ఎంతగానో కలిచివేశాయని, దీనికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబుతో తాను మాట్లాడానని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడినట్లు వెల్లడించారు.తిరుమల శ్రీవారు కోట్లాది భక్తుల ఇలవేల్పు అని, ఆ స్వామి వారి ప్రసాదాన్ని ప్రతి భక్తుడు పరమ పవిత్రంగా స్వీకరిస్తారని పేర్కొన్నారు. అంతేకాకుండా, వారి ఆత్మీయులకు కూడా శ్రీవారి ఆశీస్సులు ఈ ప్రసాదం ద్వారా లభించాలని, ఈ లడ్డూ ప్రసాదాన్ని పంచడం పెద్దల నుంచి ఆచారంగా వస్తోందన్నారు.ఇంతటి ఆధ్యాత్మిక వైశిష్ట్యం కలిగిన తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో నాణ్యతతో పాటు పవిత్రత చాలా కీలకమని పేర్కొన్నారు. అలాంటి పవిత్రతకు భంగం కలిగించే చిన్నపాటి దోషమైన క్షమార్హం కాదని రాసుకొచ్చారు. ఈ నేపథ్యంలో నిజా నిజాలను నిగ్గు తేల్చి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ముఖ్యమంత్రికి సూచించినట్లు వెల్లడించారు. ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కోరానని, అందుకు ఆయన సమ్మతించారన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com