ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిఠాపురం శక్తి పీఠంలో పంపిణీకి చీరలు అందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 29, 2024, 06:14 PM

శ్రావణ మాసం చివరి శుక్రవారం పిఠాపురంలోని శక్తి పీఠం శ్రీ పురుహూతిక అమ్మవారి ఆలయంలో వరలక్ష్మి వ్రతం పూజలు నిర్వహించి పసుపు, కుంకుమ, చీర ప్రసాదంగా అందిస్తారు. ఇందుకోసం అవసరమైన చీరలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు పంపించారు. ఎమ్మెల్సీ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ పూజలకు హాజరై పసుపు, కుంకుమ, చీరలు అందుకొనే సోదరీమణులకు గురువారం ఆలయం వద్ద టోకెన్లు అందించారు. మహిళలు బారులు తీరి టోకెన్లు తీసుకున్నారు. మూడు బ్యాచులుగా పూజలు నిర్వహిస్తారు. ఆ పూజల్లో పాల్గొనేవారికి పసుపు, కుంకుమతో కూడిన చీరను అందిస్తారు. ఈ మూడు బ్యాచుల్లో పాల్గొనలేనివారికి టోకెన్ ప్రకారం అందించాలని శ్రీ హరిప్రసాద్ గారు అధికారులకు సూచించారు. వీటి పంపిణీలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమం సంప్రదాయబద్ధంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగేందుకు భక్తులు సహకరించాలని శ్రీ హరిప్రసాద్ గారు కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com