ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలవరంపై చంద్రబాబు చెబుతున్నవన్నీ అసత్యాలే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Aug 29, 2024, 05:37 PM

పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబే శనిగ్రహం అని, ఆయన వల్లనే ప్రాజెక్టుకు ఈరోజు ఆ దుస్థితి నెలకొందని మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. నాడు సీఎంగా వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి కృషి వల్లనే పోలవరంకు కేంద్రం నిధులు ఇస్తోందన్న ఆయన, నిజానికి నాడు ఎన్నికల ముందు, ఆ నిధులు రాకుండా చంద్రబాబు కుట్ర చేశారని వెల్లడించారు. పోలవరంకు కేంద్రం నిధులపై వైయ‌స్ జగన్‌గారికి క్రెడిట్‌ రాకూడదన్న దురుద్దేశంతోనే చంద్రబాబు ఆ పని చేశారని, ఇప్పుడు అవే నిధులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పనులపై చంద్రబాబు చెబుతున్నవన్నీ అసత్యాలనీ, అభూత కల్పనలని అంబటి రాంబాబు ఫైర్‌ అయ్యారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com