ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగు టైటాన్స్ పై మొదటి విజయాన్ని నమోదు చేసుకున్న తమిళ్ తలైవాస్...

sports |  Suryaa Desk  | Published : Sat, Oct 19, 2024, 09:58 PM

ప్రో కబడ్డీ సీజన్ 11లో భాగంగా.. ఈరోజు తెలుగు టైటాన్స్-తమిళ్ తలైవాస్ మధ్య మ్యాచ్ జరిగింది. హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ విజయం సాధించింది. 44-29 పాయింట్ల తేడాతో గెలుపొందింది. దీంతో.. ఈ సీజన్ తన తొలి మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ విజయం సాధించింది. తమిళ్ తలైవాస్ జట్టులోఅత్యధికంగా నరేందర్ హోషియార్, సచిన్ 10 పాయింట్లతో రాణించారు. వారికి తోడు సాహిల్ సింగ్ 5 పాయింట్లు సాధించాడు. తెలుగు టైటాన్స్ జట్టులో పవన్ సెహ్రావత్ అత్యధికంగా 10 పాయింట్లు సాధించాడు. ఆ తర్వాత.. విజయ్ మాలిక్ 9 పాయింట్స్ చేశాడు. తమిళ్ తలైవాస్ జట్లులో టాకిల్ పాయింట్లు ఎక్కువగా ఉండటంతో విజయం సాధించింది. తమిళ్ తలైవాస్ ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. కాగా.. మొదటి మ్యాచ్ లో విజయం సాధించిన తెలుగు టైటాన్స్ ఈ మ్యాచ్‌లో ఓటమి పాలైంది. టైటాన్స్ మ్యాచ్ ఈ నెల 22వ తేదీన జైపూర్ పింక్ ప్యాంథర్స్‌తో మూడో మ్యాచ్‌లో తలపడనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com