ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీరజ్‌ చోప్రాతో పెళ్లిపై రిపోర్టర్ ప్రశ్న.. ఆగ్రహంతో సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయిన మను

sports |  Suryaa Desk  | Published : Sat, Aug 24, 2024, 09:44 PM

పారిస్ 2024 ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించిన షూటర్ మను భాకర్‌ ఒక్కసారిగా ఫేమస్‌ అయిపోయింది. పారిస్ నుంచి వచ్చిన తర్వాత ఆమె కోసం యాడ్‌ కంపెనీలు, విద్యాసంస్థలు క్యూ కడుతున్నాయి. ఇదే సమయంలో దేశంలోని నలుమూలల నుంచి ఆమెను సన్మానిస్తామంటూ ఆహ్వానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు చెన్నైకి వచ్చిన మను భాకర్‌కు ఊహించని ప్రశ్న ఎదురైంది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆమె సమాధానం చెప్పకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ మేరకు ఈ విషయంపై జాతీయ మీడియా కథనాలు ప్రచురించింది.


వాస్తవానికి మను భాకర్‌ను సన్మానించేందుకు చెన్నైలోని వేలమ్మాళ్ నెక్సస్ స్కూల్‌ ఆహ్వానించింది. ఇందులో పాల్గొనేందుకు వచ్చిన ఆమెను.. ఓ జర్నలిస్ట్‌ రెజ్లర్ వినేష్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడటం, ఆ తర్వాత ఆమె అప్పీల్‌ చేయడం, కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ ఇచ్చిన తీర్పు.. ఈ విషయాలపై ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే వీటిపై స్పందించడానికి ముందే మరో పాత్రికేయుడు.. పారిస్‌ ఒలింపిక్స్‌ సందర్బంగా నీరజ్‌ చోప్రాతో మీరు, మీ తల్లి సుమేధా భాకర్‌ ఏం మాట్లాడారు? అని ప్రశ్నించాడు.


ఈ ప్రశ్న విన్న వెంటనే మను భాకర్‌ అసహనానికి గురైందని, ఒక్క మాట కూడా మాట్లాడకుండానే వేదిక పైనుంచి కిందకు దిగి వెళ్లిపోయిందని జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. అనవసర ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు మను భాకర్‌ ఆసక్తి చూపించడం లేదనే విషయం దీంతో స్పష్టంగా అర్థమవుతోందని వివరించాయి.


పారిస్ ఒలింపిక్స్ సందర్భంగా రెండు పతకాలు సాధించిన మను భాకర్‌, రజత పతకం సాధించిన నీరజ్‌ చోప్రాలు సన్నిహితంగా మెలిగినట్లుగా ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఇందులో ఇద్దరూ సిగ్గు పడుతూ మాట్లాడుకున్నట్లు కనిపించింది. ఈ వీడియోలు కాస్తా నెట్టింట వైరల్‌ అయ్యాయి. ఇదే సమయంలో నీరజ్ చోప్రాతో మను భాకర్ తల్లి సైతం మాట్లాడింది. సంభాషణ సందర్భంగా చోప్రాతో ఏదో మాట్లాడుతూ.. ఆమె అతడితో ఒట్టు వేయించుకున్నట్లు కనిపించింది.


ఈ తతంగాన్ని మొత్తం చూసిన నెటిజన్లు.. నీరజ్-మను భాకర్‌లో ప్రేమలో ఉన్నారనే వార్తను ప్రచారం చేశారు. తమ కుమార్తెను పెళ్లి చేసుకోవాలని మను భాకర్ తల్లి సుమేధా.. నీరజ్‌ చేత ఒట్టు వేయించుకుందని కామెంట్లు చేశారు. అయితే ఈ విషయంపై ఇరు కుటుంబాలు ఇదివరకే క్లారిటీ ఇచ్చాయి. మను భాకర్ ఇంకా చిన్న పిల్ల అని అమె వివాహం చేసుకునే వయసు కూడా రాలేదని మను తండ్రి రామ్ కిషన్ తెలిపారు. తన భార్య కూడా నీరజ్‌ను తన బిడ్డలా భావిస్తోందని వివరించారు. నీరజ్ చోప్రా భారత్‌కు పతకం తెచ్చినప్పుడు ఎలా అయితే దేశం మొత్తం చూసిందో.. అదే విధంగా అతడి పెళ్లి విషయం కూడా అందరికీ తెలుస్తుందని జావెలిన్‌ త్రోయర్‌ కుటుంబం స్పష్టం చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com