ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బస్సులో ఉన్న వ్యక్తి ఫైరింగ్

national |  Suryaa Desk  | Published : Sat, Feb 02, 2019, 10:34 AM

నడి రోడ్డుపై బస్సు...ప్రయాణీకుల హాహాకారాలు...బస్సులో ఉన్న వ్యక్తి ఫైరింగ్...అక్కడకు వచ్చిన పోలీసులు తిరిగి కాల్పులు...అందరిలోనూ హై టెన్షన్...చివరకు ఆ వ్యక్తి చనిపోయాడు...దీనికి సంబంధించిన లైవ్ ఎన్ కౌంటర్ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 


ముజఫర్ పూర్ పట్టణంలో ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం ఓ బస్సులోకి గుర్తు తెలియని వ్యక్తులు ఎక్కారు. అందులో కుందన్ సింగ్ అనే పేరుమోసిన క్రిమినల్ కూడా ఉన్నాడు. విషయం పోలీసులకు తెలిసిపోయింది. వెంటనే బస్సు వద్దకు చేరుకున్నారు. ప్రయాణీకులందరూ దిగిపోయారు. అందులో ఉన్న నిందితులు పారిపోగా కుందన్ సింగ్ బస్సులోనే ఉండిపోయాడు. తప్పించుకొనేందుకు పోలీసులపైకి ఫైరింగ్ ఓపెన్ చేశాడు. ఓ పోలీసు అద్దాలు పగులగొట్టి కాల్పులు జరిపాడు. అవతలి నుండి కాల్పుల శబ్ధం వినిపించకపోవడంతో బస్సులోకి వెళ్లిన పోలీసులు బుల్లెట్లు తగిలి రక్తపుమడుగులో ఉన్న కుందన్ సింగ్‌ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. పాట్నా మెడికల్ కాలేజీకి తీసుకెళ్లాలని అక్కడి వైద్యులు సూచించారు. కుందన్ సింగ్‌ను అక్కడకు తరలించగా...వైద్యులు పరీక్షించి అప్పటికే అతను మృతి చెందాడు. పారిపోయిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com