పంజాబ్లోని జలంధర్లో ఓ చిరుత హడలెత్తించింది. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఇది గురువారం లంబా పిండ్లోని ఓ ఇంట్లోకి ప్రవేశించింది. దీంతో ప్రాణాలు అరచేత పట్టుకుని అందరూ పరుగులు తీశారు. ఇళ్లపై నుంచి దూకుతూ అక్కడున్నవారిపై చిరుత పంజా విసిరి ముగ్గురిని గాయపరిచింది. ఓ గదిలోకి ప్రవేశించిన దాన్ని అటవీ సిబ్బంది పట్టుకున్నారు.