ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిబ్రవరిలో అభ్యర్థుల ప్రకటన!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 31, 2019, 09:52 PM

వచ్చే సార్వత్రిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఆయన ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. జిల్లాల వారిగా రిపోర్టులను తీసుకున్న ఆయన గెలుపు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేసుకున్నారు. ఫిబ్రవరిలోపు అభ్యర్థులను ప్రకటిస్తామని టీడీఎల్పీ సమావేశంలో వెల్లడించారు. అయితే తాను కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలతో మాట్లాడాల్సి ఉందని, ఆ ప్రక్రియ ముగిశాక అభ్యర్థులను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అంతేకాదు ఎన్నికల ప్రచారంపై కూడా ఎమ్మెల్యేలతో చంద్రబాబు చర్చించినట్లు సమాచారం. నెల రోజుల పాటు తనకు సమయం ఉంటుందన్నారు. ఆ సమయంలో ప్రతి రోజు రెండు జిల్లాల్లో పర్యటించడం.. లేదా కార్యకర్తలతో సమావేశం నిర్వహించడం... లేకపోతే బహిరంగ సభల ద్వారా ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించడం లాంటి అంశాలపై ఎమ్మెల్యేలతో చర్చించినట్లు సమాచారం. నెల రోజుల ప్రచారంపై ఎమ్మెల్యేల అభిప్రాయాలను తీసుకున్నారు. మీరు కూడా ఆలోచించాలని, మీరు ఎలా చెబితే అలా చేస్తామని వారికి చంద్రబాబు సూచించారు. ఈ కార్యక్రమంపై రూట్ మ్యాప్‌ను సిద్ధం చేయాలని నేతలను సీఎం ఆదేశించారు. 


ఫిబ్రవరి 10వ తేది నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ రాబోతుందన్నారు. రాష్ట్రంలో ఏడు జిల్లాల్లో ఈ షెడ్యూల్ ఉంటుందని, ఆ తర్వాత మార్చి మొదటివారంలో లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రాబోతుందని పేర్కొన్నారు. ఎన్నికల్లో షెడ్యూల్ వల్ల ఎలాంటి కార్యక్రమాలను చేసేందుకు వీలుండదని అందువల్ల షెడ్యూల్ రాకముందే ప్రారంభోత్సవాలు, ఇతర అభివృద్ధి పనులను పూర్తి చేయాలని చంద్రబాబు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు.


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com