ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 10, 2024, 09:22 PM

ఇసుక తవ్వకాలతో ఏర్పడ్డ గుంతల లోతు తెలియక ఇద్దరు విద్యార్థులు  మృతి చెందిన విషాద ఘటన ప్రకాశం జిల్లా  లో చోటు చేసుకుంది. జిల్లాలోని పామూరు మండలం డివి పాలెం గ్రామానికి చెందిన పదవతరగతి విద్యార్థులు గౌతమ్‌, చరణ్‌ చదువుతున్న పాఠశాలకు రెండు రోజులు సెలవులు రావడతో ఇద్దరు సమీపంలోని వాగులో స్నానానికి వెళ్లారు.ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలు నిండిపోవడం, అక్కడ లోతు ఉండడాన్ని గమనించక స్నానానికి వాగులో దిగారు. ఈత రాని ఇద్దరు విద్యార్థులు గుంతలో పడి దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలించగా ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com