‘‘గిరిజన యోధుల త్యాగాలను తెలియజేసేందుకు లంబసింగిలో మ్యూజియం ఏర్పాటు చేస్తాం అని సీఎం చంద్రబాబు అన్నారు. అయన మాట్లాడుతూ.... గిరిజనులకు ట్రైకార్ ద్వారా రుణాలందిస్తాం. 2014-19లో ఇచ్చినట్లుగానే ఇన్నోవా కార్లు ఆదివాసీ యువతకు అందిస్తాం. గతంలో 80 స్కూళ్లను రెసిడెన్షియల్గా మార్చాం. వాటి కోసం కొత్త భవనాలు నిర్మిస్తాం. గ్రామ సచివాలయాల్లో పనిచేసే ఏఎన్ఎంలను ట్రైబల్ స్కూళ్లలో పెట్టి పిల్లల ఆరోగ్యాల్ని పర్యవేక్షిస్తాం. అరకు కాఫీ నాణ్యతను పెంపొందిస్తాం. వాణిజ్య పంటల కంటే కాఫీ పంటకు ఆదాయం అధికంగా వచ్చేలా చేస్తాం. ఆర్గానిక్ పంటల ఉత్పత్తులకు మార్కెట్ సదుపాయం కల్పిస్తాం. జీఓ నెం.3ను నేనే తీసుకొచ్చాను. విశాఖలో ఎన్నికలు ఉండటం వల్ల దానిపై మాట్లాడలేకపోతున్నాను. సీతంపేట ఐటీడీఏల్లో రూ.7కోట్లతో సమగ్ర పసుపు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తాం. ఎన్టీఆర్ ఎడ్వంచర్ పార్క్ రూ.2.54 కోట్లతో అభివృద్ధి చేస్తాం. పార్వతీపురం ఐటీడీఏ కొమరాడ మండలం పూర్ణపాడు-లాబేసు గ్రామాల మధ్య నాగావళి నదిపై హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తాం. చింతూరు ఐటీడీఏ పరిధిలో 11 ఎత్తిపోతల పథకాలను రూ.2.5 కోట్లతో నిర్మిస్తాం. పాడేరులో మెడికల్ కళాశాలను రూ.500 కోట్ల ఖర్చు చేసి పూర్తిచేస్తాం. 418 ఏకోపాధ్యాయ పాఠశాలలకు రూ.50 కోట్లతో భవనాలు పూర్తి చేస్తాం. అల్లూరి జిల్లా కేంద్రంలో మూడు ప్రధాన రహదారుల కారిడార్ను రూ.50కోట్లతో పూర్తి చేస్తాం. పాడేరు ఏజెన్సీలో రూ.10 కోట్లతో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తాం. 2191 గిరిజన గ్రామాలకు త్వరలో రోడ్డు మార్గాలు నిర్మిస్తాం. 16,816 గిరిజన నివాస ప్రాంతాలకు కుళాయి ద్వారా నీళ్లందిస్తాం’’ అని సీఎం హామీ ఇచ్చారు.