ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సాంస్కృతిక కార్యక్రమాలతో సందడిగా మారిన పున్నమి ఘాట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Oct 22, 2024, 08:40 PM

అమరావతి డ్రోన్ సమ్మిట్ లో భాగంగా ఈ సాయంత్రం విజయవాడ పున్నమి ఘాట్ వద్ద భారీ డ్రోన్ షో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ డ్రోన్ షోలో 5 వేల డ్రోన్లతో వివిధ రకాల విన్యాసాలు ప్రదర్శించనున్నారు. ఇక, డ్రోన్ షో సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను చంద్రబాబు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబుతో పాటు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, రాష్ట్రమంత్రి కొండపల్లి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. వివిధ రంగాలకు చెందిన వారిని ఈ డ్రోన్ షోకి ఆహ్వానించడంతో, పున్నమి ఘాట్ వద్ద భారీ కోలాహలం నెలకొంది. ఏపీ రాజధాని అమరావతిలో రెండ్రోజుల పాటు డ్రోన్ సమ్మిట్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇవాళ సీఎం చంద్రబాబు ఈ భారీ ఈవెంట్ ను లాంఛనంగా ప్రారంభించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com