తిరుమల శ్రీవారి దర్శనం, సుప్రభాత సేవ కోసం ఓ భక్తుడు అతి తెలివి ప్రదర్శించాడు. చివరికి విజిలెన్స్ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. బెంగళూరుకు చెందిన శ్రీధర్ అనే వ్యక్తి నకిలీ ఆధార్ కార్డుల ద్వారా టీటీడీ లక్కీడిప్ సేవా టికెట్లు పొందేందుకు ప్రయత్నించాడు. ఆయన ఏకంగా 400 రిజిస్ట్రేషన్లు చేసినట్లు గుర్తించారు. ఇలా ఇప్పటివరకు 20సార్లు సుప్రభాత సేవా టికెట్లు పొందినట్లు తేలింది.. బుధవారం మరోసారి సుప్రభాత సేవ కోసం వచ్చిన అతడిని టీటీడీ విజిలెన్స్ అధికారులు గుర్తించి పట్టుకున్నారు. అతడు నకిలీ ఆధార్ కార్డుపై సుప్రభాత టికెట్లను పొందినట్లు తేలిందన్నారు. అతడిని తిరుమలలో పోలీసులకు అప్పగించారు.