ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్ల ట్రాన్స్ఫర్లు చోటు చేసుకున్నాయి. ఒకేసారి 62 మంది ఐఏఎస్ అధికారులను ఏపీ ప్రభుత్వం బదిలీలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఐఏఎస్ల బదిలీపై శనివారం రాత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. కేరళ కేడర్లో పనిచేస్తున్న ఏపీకి చెందిన యువ ఐఏఎస్ ఎం కృష్ణతేజను.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక విజ్ఞప్తితో డిప్యూటేషన్ మీద సొంత రాష్ట్రానికి రప్పించారు. ఐఏఎస్ కృష్ణతేజను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్గా ఏపీ ప్రభుత్వం నియమించింది. ఇక స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్గా ఎం.వి.శేషగిరి రావు నియమితులయ్యారు.
గుంటూరులోని పల్పాడు (డీ) చిలకలూరిపేటకు చెందిన మైలవరపు కృష్ణతేజ.. 2014 సివిల్స్ పరీక్షలో 66వ ర్యాంక్ సాధించారు. ఐఏఎస్లో చేరిన తర్వాత వెనుకబడిన తరగతుల అభ్యున్నతి, మహిళా సాధికారత, నాణ్యమైన విద్య వంటి అంశాలపై దృష్టి సారించారు. 2018లో కేరళ వరదల సమయంలో అలెప్పీ జిల్లా సబ్ కలెక్టర్గా ఉన్న కృష్ణతేజ 2.50 లక్షలమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అలాగే సరస్సును ఆక్రమించి నిర్మించిన 54 ఖరీదైన విల్లాలను నేలమట్టం చేయించారు. దీంతో ఒక్కసారిగా ఐఏఎస్ కృష్ణతేజ దేశవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. అయితే ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత ఎలా అయినా ఆయనను రాష్ట్రానికి రప్పించాలని భావించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. కేంద్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయగా.. తాజాగా అది నెరవేరింది.
ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్లు
ఎం కృష్ణతేజ - పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్
చేవూరి హరికిరణ్ - ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ డైరెక్టర్
మల్లికార్జున - బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్ (బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ కమిషనర్గా అదనపు బాధ్యతలు)
శ్రీకేష్ బాలాజీరావు - ల్యాండ్ సర్వే, సెటిల్మెంట్లు డైరెక్టర్
ఎం.వేణుగోపాల్రెడ్డి - మహిళ, శిశుసంక్షేమశాఖ డైరెక్టర్
జి.సి కిషోర్ కుమార్ - క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్ మిషన్ ఎండీ
గిరీశ్ షా - పౌరసరఫరాల కార్పొరేషన్ ఎండీ
కీర్తి చేకూరి - ట్రాన్స్ కో జాయింట్ ఎండీ
నిషాంత్ కుమార్ - ఎక్సైజ్ శాఖ ప్రొహిబిషన్ డైరెక్టర్
దినేష్ కుమార్ - గుంటూరు మున్సిపల్ కమిషనర్
విజయ సునీత - వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ డైరెక్టర్
కృతికా శుక్లా - ఇంటర్ ఎడ్యుకేషన్ డైరెక్టర్
లక్ష్మీ షా - ఏపీ ఎంఎస్ఐడీసీ ఎండీ (ఎన్టీఆర్ వైద్యసేవ సీఈఓగా అదనపు బాధ్యతలు)
మంజీర్ జిలానీ - ఏపీ మార్క్ఫెడ్ ఎండీ (శాప్ ఎండీగా అదనపు బాధ్యతలు)
రవి సుభాష్ - ఎస్పీపీడీసీఎల్ సీఎండీ
ఎం. హరినారాయణ - మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్
ఎంవీ శేషగిరి బాబు - స్టాంప్స్, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ, కమిషనర్
సీహెచ్ శ్రీదత్ - మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్ (మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ అదనపు బాధ్యతలు)
రేఖారాణి - హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్శాఖ కమిషనర్
సూర్యసాయి ప్రవీణ్ చంద్, నవీన్ - సీఆర్డీఏ అడిషనల్ కమిషనర్లు
నారపురెడ్డి మౌర్య - తిరుపతి మున్సిపల్ కమిషనర్
రామసుందర్రెడ్డి - ఆర్ అండ్ ఆర్ కమిషనర్
తేజ్ భరత్ - కడప మున్సిపల్ కమిషనర్
సంపత్ కుమార్ - విశాఖ మున్సిపల్ కమిషనర్
ధ్యానచంద్ర - విజయవాడ మున్సిపల్ కమిషనర్
కేతన్ గార్గ్ - రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్
ప్రసన్న వెంకటేశ్ - సాంఘిక, సంక్షేమశాఖల కార్యదర్శి
నూరుల్ కమల్ - ఆర్థికశాఖ డిప్యూటీ సెక్రటరీ
వీరపాండ్యన్ - సెర్ప్ సీఈవో
అమిలినేని భార్గవతేజ - గుంటూరు జిల్లా జేసీ
హిమాన్షు కోహ్లీ - తూర్పుగోదావరి జేసీ
నిశాంతి - కోనసీమ జిల్లా జేసీ
సూరజ్ ధనుంజయ్ - పల్నాడు జేసీ
గోవిందరావు - కాకినాడ జేసీ
ఆదర్శ్ రాజేంద్రన్ - అన్నమయ్య జిల్లా జేసీ
ఫర్మాన్ అహ్మద్ ఖాన్ - శ్రీకాకుళం జేసీ
పి ధాత్రిరెడ్డి - ఏలూరు జేసీ
అభిషేక్ గౌడ - అల్లూరి జిల్లా జేసీ
అదితి సింగ్ - కడప జేసీ
నిది మీనా - ఎన్టీఆర్ జిల్లా జేసీ
విష్ణు చరణ్ - నంద్యాల జేసీ
శుభం భన్సాల్ - తిరుపతి జేసీ