ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిల్లల అల్లరి మాన్పించే క్రమంలో ఉరి,,,చీర బిగుసుకుని లోకో పైలెట్ కన్నుమూత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 19, 2024, 08:35 PM

 క్షణికావేశంలో చేసిన పనితో ఆ కుటుంబం పెద్దను కోల్పోయింది. విశాఖపట్నంలో జరిగిన ఈ ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రాథమిక సమాచారం మేరకు.. బీహార్‌కు చెందిన చందన్‌కుమార్‌ రైల్వేలో సీనియర్‌ అసిస్టెంట్ లోకో పైలట్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయనకు భార్య కూతురు, కుమారుడు ఉన్నారు. ఈ కుటుంబం ఐదేళ్ల నుంచి 89వ వార్డు కొత్తపాలెంలో నివాసం ఉంటోంది. బుధవారం రాత్రి చందన్‌కుమార్ జేబులోని కరెన్సీ నోట్లను తీసి కూతురు, కొడుకు చించేశారు. పిల్లలు కరెన్సీ నోట్లు చించడంపై చందన్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అతడి భార్య అడ్డుపడ్డారు.. ఈ క్రమంలో భార్యతో అతడికి చిన్న గొడవ జరిగింది. తనకు చికాకుంగా ఉందని.. ప్రశాంతత లేకుండా చేస్తే ఆత్మహత్య చేసుకుంటానని చందన్‌కుమార్‌ బెదిరించే ప్రయత్నం చేశారు. ఇంట్లో వారు వినిపించుకోకపోవడంతో.. ఇంట్లోని ఫ్యాన్‌హుక్‌కు చీర కట్టి, దాన్ని మెడకు చుట్టుకుని బెదిరించే ప్రయత్నం చేశారు.


కుటుంబ సభ్యుల్ని బెదరిస్తున్న కమ్రంలో.. పొరపాటున చీర మెడకు బిగుసుకుపోయింది. వెంటనే భార్య అప్రమత్తమై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న భర్తను కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్లు వచ్చేసరికి చందన్ కుమార్ చనిపోయాడు.. మృతుడి భార్య పోలీసులకు సమాచారం ఇవ్వగా.. గురువారం ఉదయం పోలీసులు ఘటనాస్థలానికి వచ్చారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ కోసం కేజీహెచ్‌కు తరలించారు. ఇంట్లో పిల్లల అల్లరిని మాన్పించడానికి చేసిన ప్రయత్నం చందన్‌కుమార్ ప్రాణాలు తీసింది. చందన్ మరణంతో కుటుంసభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు.


మధురవాడ సమీపంలోని సాగర్‌నగర్‌ కాలనీలో పులి సంచారం అంటూ ప్రచారం జరిగింది. ఎల్‌ఐజీ నివాసాల దగ్గర నీళ్ల ట్యాంకు ఎదురుగా పార్కులో పులి కనిపించిందని కాలనీ వాసులు చెబుతున్నారు. ఓ మహిళ గురువారం ఉదయం 4 గంటల ప్రాంతంలో వాకింగ్‌ఋకు వెళ్లగా.. పార్కు ఆవరణలో చీకట్లో ఓ జంతువును చూసి పులి అనుకున్నారు. దీంతో పార్కు సమీపంలోని ఓ భవనంపైకి ఎక్కి ఆవరణ మొత్తం పరిశీలించగా.. ఏ జంతువు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత పార్కులోకి వచ్చి పరిశీలించగా జంతువు కాలి ముద్రలు కనిపించాయి. వెంటనే స్థానికులు అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు పాార్కులో పాద ముద్రల్ని పరిశీలించారు. ఇవి పులి గుర్తులు కావని పిల్లి, కుక్క జాతికి చెందినవని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. గతంలో ఎప్పుడో ఆ సమీపంలో పులి సంచరించిందనే వార్తలు కూడా వచ్చాయట.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com