ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపుతాం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jul 15, 2024, 02:44 PM

ఎర్రచందనం, గంజాయి అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని డీజీపీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. ప్రత్యేక టాస్క్‌ఫోర్సు ద్వారా స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఆదివారం ఆయన కుటుంబ సమేతంగా చిత్తూరు జిల్లా కాణిపాకంలో వరసిద్ధి వినాయకస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ......  రాష్ట్రంలో ఎక్కడా గంజాయి, మత్తు పదార్థాల అమ్మకాలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అన్ని కేసులను సమర్థంగా విచారించడానికి పోలీసులు శక్తివంచన లేకుండా శ్రమించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలుతున్న మద్యాన్ని అడ్డుకుంటామన్నారు. గ్రామాల్లో నాటు సారా తయారీ, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడతామని వివరించారు. దీనికోసం చెక్‌ పోస్టులను బలోపేతం చే సి, వాహనాలను తనిఖీ చేస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చిన్నపిల్లలు, మహిళల భద్రతను మరింత పటిష్ఠం చేస్తామని వెల్లడించారు. నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని మరింత పెంచుతామన్నారు. నేరాలను అదుపులో ఉంచేందుకు సీసీ కెమేరాలు, డ్రోన్లు, డిజిటల్‌ ఫోరెన్సిక్‌ పరికరాలను విస్తృతంగా వినియోగిస్తామని చెప్పారు. ఫ్యామిలీ కౌన్సెలింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామన్నారు. రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు వివరించారు. కాగా, ఆదివారం ఉదయం డీజీపీ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com