ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డు ప్రమాదంలో ఒకరికి గాయాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 05, 2024, 12:57 PM

గుర్తు తెలియని వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయని విజయనగరం జిల్లా, రాజాం టౌన్‌ సీఐ దాడి మోహనరావు తెలిపారు. గత నెల 29న అర్ధరాత్రి దాటాక తెర్లాం మండలం చీకటిపేటకు చెందిన అక్కివరపు బంగారి, కొన్న నగేష్‌ రాజాం నుంచి తన స్వగ్రామానికి నడిచి వెళ్తుండగా రాజయ్యపేట జంక్షన్‌ వద్ద గుర్తు తెలియని వాహనం వారిద్దరినీ ఢీకొంది. ఈ ప్రమాదంలో అక్కివరపు బంగారి తీవ్ర గాయాలపాలయ్యాడు. మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళంలోని కిమ్స్‌లో చేరారు. అక్కడి నుంచి వచ్చిన మెడికల్‌ ఇంటి మేషన్‌ మేరకు గురువారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com