కనిగిరి దుర్గం 1314వ శతాబ్దంలో కాటంరాజు ఏలుబడిలో ఉన్నట్లు చారిత్రిక ఆధారాల ప్రకారం తెలుస్తుంది. కాటంరాజు కనిగిరి దుర్గాన్ని కేంద్రంగా చేసుకొని పరిపాలించాడు. నాడు ఈ ప్రాంతాన్ని బంగారు కొండ అని కూడా పిలిచేవారు. ఆయన ఏలుబడిలో కడప, కర్నూలు ప్రాంతాలు కూడా ఉన్నట్లు కొన్ని శాసనాల ద్వారా తెలుస్తుంది. ఆయన పాలనలో కనిగిరి ప్రాంతంలో కరువు ఏర్పడటంతో నెల్లూరు పాలకుడైన మనుమసిద్ధి రాజుతో ఒప్పందం కుదిరించుకున్నారని చరిత్ర.
![]() |
![]() |